జోగులాంబ గద్వాల జిల్లా భీంపూర్‌లో కూలిన బ్రిడ్జి.. నిలిచిపోయిన రాకపోకలు

Bridge Collapsed in Jogulamba Gadwal District | Telugu Online News
x

జోగులాంబ గద్వాల జిల్లా భీంపూర్‌లో కూలిన బ్రిడ్జి.. నిలిచిపోయిన రాకపోకలు

Highlights

Jogulamba Gadwal: 30 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన...

Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలం భీంపురం గ్రామ సమీపంలోని జూరాల ప్రాజెక్ట్ కుడి కాలువపై నిర్మించిన వంతెన కూలిపోయింది. సుమారు 30 ఏళ్ల క్రితం ఈ వంతెన నిర్మించారు. కాంక్రీట్ వాహనం బ్రిడ్జి మీదుగా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ వంతెన మీద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహన డ్రైవర్ చాకచక్యంగా వంతెనపై వాహనాని ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. బ్రిడ్జి కూలడంతో వాహన రాకపోకలను ఇతర మార్గాల గుండా మళ్ళించారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories