విశాఖ వేదికగా తొలిసారిగా కొహ్లీ విఫలం

విశాఖ వేదికగా తొలిసారిగా కొహ్లీ విఫలం
x
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తనకు ఎంతగానో అచ్చివచ్చిన విశాఖలోని ACA స్టేడియంలో తొలిసారిగా విఫలమయ్యాడు. రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా...

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తనకు ఎంతగానో అచ్చివచ్చిన విశాఖలోని ACA స్టేడియంలో తొలిసారిగా విఫలమయ్యాడు. రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ లో కేవలం 24 పరుగులకే అవుటయ్యాడు, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కొహ్లీ 17 బాల్స్ లో 3 బౌండ్రీలతో 24 పరుగుల స్కోరుకు లెగ్ స్పిన్నర్ ఆడం జంపా బౌలింగ్ లో కౌల్టర్ నైల్ పట్టిన క్యాచ్ కు అవుటయ్యాడు. ఈమ్యాచ్ కు ముందు వరకూ విశాఖ వేదికగా వన్డే, టెస్ట్, టీ-20 మ్యాచ్ లు ఆడిన కొహ్లీకి నాలుగు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు సాధించిన అరుదైన రికార్డు ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories