ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో ఒలింపిక్స్ పతకాలు

ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో ఒలింపిక్స్ పతకాలు
x
Highlights

వినూత్న ఆవిష్కరణలకు చిరునామాగా నిలిచే జపాన్ వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్ క్రీడల కోసం ఓ వినూత్న పథకాన్ని చేపట్టింది. క్రీడల వేదిక టోక్యో...

వినూత్న ఆవిష్కరణలకు చిరునామాగా నిలిచే జపాన్ వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్ క్రీడల కోసం ఓ వినూత్న పథకాన్ని చేపట్టింది. క్రీడల వేదిక టోక్యో నగరంలో గుట్టలుగుట్టలుగా పేరుకు పోయిన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఇతర కంప్యూటర్ పరికరాల ఇ-వేస్ట్ వ్యర్థాలను రిసైకిల్ చేయడం ద్వారా లభించిన స్వర్ణ,రజత, కాంస్య లోహాలను ఉపయోగించి పతకాలను తయారు చేయటానికి రంగం సిద్ధం చేసింది.

ఒలింపిక్స్ లో విజేతలుగా నిలిచిన వారి కోసం మొత్తం 5 వేల వరకూ స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అవసరమని నిర్వాహక సంఘం అంచనావేసింది. ఈ పతకాలకు అవసరమైన బంగారం, వెండి, కంచు లోహాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచే సేకరించారు. స్వర్ణ పతకాలకు అసరమైన బంగారాన్ని 28.4 కిలోలు, 3వేల 500 కిలోల వెండిని, 2వేల 700 గ్రాముల కంచు లోహాలను ఇ-వేస్ట్ నుంచి రాబట్టగలిగారు. గత ఏడాది నవంబర్ వరకూ సేకరించిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వ్యర్థాలలో 51 లక్షల స్మార్ట్ ఫోన్లు సైతం ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories