Team India: శ్రీలంకతో టీ-20 సిరీస్ క్లీన్ స్వీప్

T20 Series Clean Sweep With Sri Lanka
x

Team India: శ్రీలంకతో టీ-20 సిరీస్ క్లీన్ స్వీప్

Highlights

Team India: ధర్మశాల మ్యాచ్‌లోనూ టీం ఇండియా గెలుపు, 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు.

Team India: టీమిండియా వరుసగా మరో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఇటీవల వెస్టిండీస్‌పై వన్డే, టీ20 సిరీస్‌ల్లో నెగ్గిన భారత్ తాజాగా శ్రీలంకపైనా అదే ప్రదర్శన కనబర్చింది. ధర్మశాలలో శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక విసిరిన 147 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ మరోసారి అర్ధసెంచరీతో అలరించాడు. అయ్యర్ 45 బంతుల్లో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయ్యర్ స్కోరులో 9 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. రవీంద్ర జడేజా 15 బంతుల్లో 22 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార 2, చమీర 1, కరుణరత్నే 1 వికెట్ తీశారు. ఈ విజయంతో టీ20 సిరీస్ ను భారత్ 3-0తో గెలిచింది. ఇక ఇరుజట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ మార్చి 4న ప్రారంభం కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories