రోహిత్‌ ఖాతాలో మరో ఘనత

రోహిత్‌ ఖాతాలో మరో ఘనత
x
Highlights

భారత క్రికెటర్‌ రోహిత్‌ శర్మ మరో ఘనత సాధించాడు. ముంబై ఇండియన్స్ డాషింగ్ ఓపెనర్ కమ్ కెప్టెన్ రోహిత్ శర్మ ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో ఎనిమిదివేల పరుగుల...

భారత క్రికెటర్‌ రోహిత్‌ శర్మ మరో ఘనత సాధించాడు. ముంబై ఇండియన్స్ డాషింగ్ ఓపెనర్ కమ్ కెప్టెన్ రోహిత్ శర్మ ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో ఎనిమిదివేల పరుగుల మైలురాయిని చేరాడు. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో ముగిసిన మ్యాచ్ లో రోహిత్ 22 బాల్స్ లో మూడు బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 30 పరుగులు సాధించడం ద్వారా 8వేల పరుగుల రికార్డును పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. టీ-20 క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు కరీబియన్ ఓపెనర్ క్రిస్ గేల్ పేరుతో ఉంది. గేల్ 12 వేల 670 పరుగులతో నంబర్ వన్ ఆటగాడిగా ఉన్నాడు. మెకల్లమ్, పోలార్డ్, షోయబ్ మాలిక్, వార్నర్, రైనా, కొహ్లీ సైతం రోహిత్ కంటే ముందే 8వేల పరుగులు సాధించగలిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories