INDW vs SLW: లంకపై ఘనవిజయం.. ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం గెలిచిన టీమిండియా..!

India Women Won By 19 Runs Against Sri Lanka Women And Win Win GOLD Medal In Asian Games 2023 Womens Cricket Final
x

INDW vs SLW: లంకపై ఘనవిజయం.. ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం గెలిచిన టీమిండియా..!

Highlights

India Women vs Sri Lanka Women: ఆసియా క్రీడల మహిళల క్రికెట్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

India Women vs Sri Lanka Women: ఆసియా క్రీడల మహిళల క్రికెట్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 19 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. ఇంతకు ముందు భారత క్రికెట్ జట్టు ఏ ఆసియా క్రీడల్లోనూ పాల్గొనలేదు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసి శ్రీలంకకు 117 పరుగుల లక్ష్యాన్ని అందించింది. లక్ష్యాన్ని ఛేదించలేక పోయిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత్ తరపున స్మృతి మంధాన అత్యధిక పరుగులు చేసింది. 45 బంతుల్లో 46 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడింది. మంధానతో పాటు జెమిమా రోడ్రిగ్స్ 40 బంతుల్లో 42 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడింది. శ్రీలంక తరపున ఇనోకా రణవీర, సుగంధికా కుమారి, ఉదేశిక ప్రబోధిని తలో 2 వికెట్లు తీశారు.

శుభారంభం తర్వాత తడబడిన భారత జట్టు..

భారత జట్టుకు శుభారంభం లభించింది. 14 ఓవర్ల వరకు ఒక వికెట్ కోల్పోయి 86 పరుగులు చేసిన భారత జట్టు, తర్వాతి 6 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 30 పరుగులు మాత్రమే చేయగలిగింది. మంధాన, జెమీమా మినహా మరే ప్లేయర్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.

పవర్‌ప్లే: శ్రీలంకకు బ్యాడ్ స్టార్ట్..

ఛేజింగ్‌కు దిగిన శ్రీలంక జట్టుకు బ్యాడ్ స్టార్ట్ అయింది. తొలి 6 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 28 పరుగులు మాత్రమే చేసింది. పవర్‌ప్లేలో టిటాస్ సాధు మూడు వికెట్లు తీశాడు.

మంధాన-రోడ్రిగ్స్‌ల హాఫ్ సెంచరీ భాగస్వామ్యం..

16 పరుగుల వద్ద షెఫాలీ వికెట్ కోల్పోయిన తర్వాత, మంధాన, రోడ్రిగ్స్ 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 67 బంతుల్లో 73 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని ఇనోకా రణవీరా బ్రేక్ చేసింది.

పవర్‌ప్లే: భారత్‌కు బలమైన ఆరంభం..

మంధాన, రోడ్రిగ్స్ మొదట బ్యాటింగ్‌కు వచ్చిన భారత జట్టుకు గొప్ప ఆరంభాన్ని అందించారు. 16 పరుగుల వద్ద షెఫాలీ వికెట్ కోల్పోయిన తర్వాత, మంధాన రోడ్రిగ్జ్‌తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. తొలి 6 ఓవర్లలో టీమ్ ఇండియా ఒక వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది.

టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, దేవికా వైద్య, అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్.

శ్రీలంక ప్లేయింగ్ XI: చమరి అటపట్టు (కెప్టెన్), అనుష్క సంజీవని, విష్మి గుణరత్నే, నీలాక్షి డి సిల్వా, హాసిని పెరీరా, ఉదేశిక ప్రబోధిని, ఇనోకా రణవీర, ఇనోషి ప్రియదర్శిని, సుగంధికా కుమారి, కవిక్ష దిహారి, ఓషాది రణసింగ్.

Show Full Article
Print Article
Next Story
More Stories