భారత్‌ భారీ స్కోరు; ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌

sydney test
x
sydney test
Highlights

సిడ్నీ టెస్టు రెండోరోజు ఆటలో నయావాల్ చతేశ్వర్ పూజారా, మిడిలార్డర్ ఆటగాళ్లు రిషభ్ పంత్, రవీంద్ర జడేజా చెలరేగిపోడంతో టీమిండియా భారీస్కోరుతో ఇన్నింగ్స్ ను ముగించింది. 7 వికెట్లకు 622 పరుగులతో డిక్లేర్ చేసింది.

సిడ్నీ టెస్టు రెండోరోజు ఆటలో నయావాల్ చతేశ్వర్ పూజారా, మిడిలార్డర్ ఆటగాళ్లు రిషభ్ పంత్, రవీంద్ర జడేజా చెలరేగిపోడంతో టీమిండియా భారీస్కోరుతో ఇన్నింగ్స్ ను ముగించింది. 7 వికెట్లకు 622 పరుగులతో డిక్లేర్ చేసింది. సమాధానంగా ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 24 పరుగుల స్కోరుతో నిలిచింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజు ఆట కొనసాగించిన టీమిండియా పరుగుల మోత మోగించింది. తొలిరోజు ఆటలో 19వ శతకం బాదిన పూజారా డబుల్ సెంచరీ సాధించడం లో విఫలమయ్యాడు. చివరకు 193 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. రిషభ్ పంత్ 159 పరుగుల స్కోరుతో నాటౌట్ కాగా రవీంద్ర జడేజా 81 పరుగులకు అవుటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో లయన్ 4 వికెట్లు, హేజిల్ వుడ్ 2, స్టార్క్ ఒక వికెట్ పడగొట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories