Australia vs India 3rd Test: భారత్ తొలి ఇన్నింగ్స్ ఖేల్ ఖతమ్.. ఆసీస్‌కు 94 పరుగుల ఆధిక్యం!

Australia vs India 3rd Test: భారత్ తొలి ఇన్నింగ్స్ ఖేల్ ఖతమ్.. ఆసీస్‌కు 94 పరుగుల ఆధిక్యం!
x
Highlights

బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాట్స్ మెన్ తక్కువ పరుగులకే చేతులేత్తేశారు.

బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాట్స్ మెన్ తక్కువ పరుగులకే చేతులేత్తేశారు. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ 244 పరుగులకు ముగిసింది. ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. పుజారా (50: 176 బంతుల్లో 5x4)హాఫ్ సెంచరీలతో ఫర్వాలేదనిపించగా..చివర్లో రవీంద్ర జడేజా (28 నాటౌట్)విలువైన పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ నాలుగు వికెట్లకు దక్కించుకోగా.. జోష్ హజెల్ వుడ్ రెండు, మిచెల్ స్టార్క్ ఓ వికెట్ పడగొట్టారు.

ఓవర్‌నైట్ స్కోరు 96/2తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ మూడో రోజు తొలి సెషన్ లోనే కీలక వికెట్లు చేజార్చుకుంది. కెప్టెన్ రహానే (22, 70 బంతుల్లో) త్వరగానే ఔటైయ్యాడు. హనుమ విహారి(4) రనౌటైయ్యాడు.

భారత్ భోజన విరామ సమయానికి 79 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయడంతో భారత్ ఇన్నింగ్స్ మెరుగ్గానే అనిపించింది. కమిన్స్ బౌలింగ్‌లో ఓ బంతి రిషభ్ పంత్(36) లెఫ్ట్ ఎల్బోకు బలంగా తాకింది. టీమిండియా ఫిజియో పరీక్షించి చికిత్స చేయడంతో పంత్ బ్యాటింగ్ కొనసాగించాడు. నొప్పితో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డ పంత్ హజెల్ వుడ్ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ అలానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. రవిచంద్రన్ అశ్విన్(10) రనౌట్ కాగా.. నవ్‌దీప్ సైనీ(3) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తరువాత బుమ్రా(0) రనౌటయ్యాడు. ఇక సిరాజ్(6)ఔట్ కాగా.. జడేజా(28) పర్వాలేదనిపించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories