స్టేడియంలో హల్‌చల్‌ : యాంకర్‌తోపాటు ఆరుగురు బుక్‌

స్టేడియంలో హల్‌చల్‌ : యాంకర్‌తోపాటు ఆరుగురు బుక్‌
x
Highlights

ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్-కోల్‌కతా మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ చూసేందుకు వెళ్లి.. ఓ గ్యాంగ్ నానా హంగామా చేసింది. మద్యం మత్తులో...

ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్-కోల్‌కతా మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ చూసేందుకు వెళ్లి.. ఓ గ్యాంగ్ నానా హంగామా చేసింది. మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తిస్తూ పక్క సీట్లలో కూర్చున్నవారిని ఇబ్బందిపెట్టారు. వారి న్యూసెన్స్‌తో ఆ గ్యాలరీలోని ప్రేక్షకులు మ్యాచ్‌ను ప్రశాంతంగా తిలకించలేకపోయారు. వారి ప్రవర్తనను తట్టుకోలేని ఓ ప్రేక్షకుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్-కోల్‌కతా మ్యాచ్ చూసేందుకు నగరానికి చెందిన ప్రముఖ టీవీ యాంకర్‌ ప్రశాంతితోపాటు పూర్ణిమ, ప్రియ, శ్రీకాంత్ రెడ్డి, సురేశ్, వేణుగోపాల్‌లు వచ్చారు. అప్పటికే పూర్తిగా మద్యం మత్తులో ఉన్న వీరి చేష్టలు గ్యాలరీలోని ఇతర ప్రేక్షకులకు వెగటు పుట్టించాయి. పూర్తిగా మైకంలో ఉన్న ఓ యువతి అసభ్యంగా ప్రవర్తించింది. అంతేకాదు, సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో వీరు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories