మోడీతో భేటీ అయిన అమిత్‌షా, రాజ్‌నాథ్

మోడీతో భేటీ అయిన అమిత్‌షా, రాజ్‌నాథ్
x
Highlights

ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్, తోమర్ భేటీ అయ్యారు. రైతులు, ప్రభుత్వం మధ్య కాసేపట్లో ఐదో రౌండ్ చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీతోమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్, తోమర్ భేటీ అయ్యారు.

ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్, తోమర్ భేటీ అయ్యారు. రైతులు, ప్రభుత్వం మధ్య కాసేపట్లో ఐదో రౌండ్ చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీతోమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్, తోమర్ భేటీ అయ్యారు. ఈ నెల 8 న భారత్ బంద్, ఐదో రౌండ్ చర్చల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరు చర్చించినట్లు సమాచారం. ఇప్పటి వరకూ రైతులతో చర్చించిన అంశాలు, రైతులు ప్రస్తావించిన డిమాండ్లను మంత్రులు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్‌ చెబుతున్నదాని ప్రకారం... ఈ చర్చల్లో ఏదో ఒకటి తేలిపోవచ్చు. అటు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంఘమైన భారతీయ కిసాన్‌ సంఘ్‌ కూడా రైతుల డిమాండ్లకు మద్దతు పలుకింది. కనీస మద్దతు ధర వ్యవస్థను కొనసాగించాలని, ప్రభుత్వ, ప్రైవేటు మండీల్లో కూడా ఎంఎస్పీ రేటే అమలుకావాలని, ఇందుకు చట్టం చేయాలని, ఎంఎస్పీ కంటే చౌక ధరకు కొనడం నేరమని చట్టంలో చేర్చాలని బీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి బదరీనారాయణ చౌధురి డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories