Kedarnath Yatra: తెరచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం

The Doors of Kedarnath Dham Opened for Devotees
x

Kedarnath Yatra: తెరచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం 

Highlights

Kedarnath Yatra: ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు ఈ రోజు ఉదయం తెరుచుకున్నాయి.

Kedarnath Yatra: ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు ఈ రోజు ఉదయం తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్‌లోని కేదారీశ్వరుడి ఆలయ ద్వారాలను ఉదయం 6.26 గంటలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య తెరిచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కేదారీశ్వరుడిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంతం శివనామస్మరణతో మార్మోగింది. ఈ క్షేత్రాన్ని 15 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఈ నెల 3 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కేదార్ నాథ్ ఆలయాన్ని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.


Show Full Article
Print Article
Next Story
More Stories