అత్యంత విషమంగా లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి.. సింగపూర్ తీసుకెళ్లే ఛాన్స్

RJD Leader Lalu Prasad Yadavs Health Condition is Very Serious
x

అత్యంత విషమంగా లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి.. సింగపూర్ తీసుకెళ్లే ఛాన్స్

Highlights

*లాలూ శరీరంలో కదలికలు లేవన్న తేజస్వి యాదవ్

Lalu Yadav Health Updates: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లుగా తెలుస్తోంది. లాలూ శరీరంలో కదలికలు లేవంటున్నారు తేజస్వి యాదవ్. డాక్టర్ల చెకప్ తర్వాత లాలూను సింగపూర్ తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్​కు దిల్లీ ఎయిమ్స్​లో చికిత్స కొనసాగుతోంది. బుధవారం రాత్రి ఆయన్ను ప్రత్యేక ఎయిర్ అంబులెన్సులో దిల్లీకి తీసుకెళ్లారు. అయితే, ఆయన పరిస్థితి మెరుగుపడలేదని తెలుస్తోంది. లాలూ శరీరంలో కదలికలు లేవని ఆయన తనయుడు తేజస్వీ యాదవ్ తెలిపారు.

"దిల్లీ ఎయిమ్స్ వైద్యులు లాలూ యాదవ్​కు చాలా రోజుల నుంచి చికిత్స చేస్తున్నారు. నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి అవగాహన ఉన్న వైద్యులు ఇక్కడ ఉన్నారు. ఇంట్లో కిందపడ్డ సమయంలో మూడు చోట్ల ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన శరీరంలో ఎలాంటి కదలికలు లేవు. ఇప్పటివరకు వైద్యులు చాలా మందులు ఇచ్చారు. చెకప్ తర్వాత ఏం చేయాలనే దానిపై ఓ నిర్ణయానికి వస్తాం."

లాలూ పరిస్థితి మెరుగుపడకపోతే సింగపూర్ తీసుకెళ్తామని ఇదివరకే తేజస్వీ వెల్లడించారు. కిడ్నీ మార్పిడి చికిత్స కోసం గత నెలలోనే జార్ఖండ్ హైకోర్టు నుంచి లాలూ అనుమతి తీసుకున్నారు. లాలూ కుటుంబాన్ని పరామర్శించేందుకు పలువురు బిహార్ మంత్రులు, రాజకీయ ప్రముఖులు దిల్లీ ఎయిమ్స్​కు చేరుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories