PV Sindhu: పీవీ సింధుతో కలిసి ఐస్‌క్రీమ్ తిన్న ప్రధాని మోడీ

PV Sindhu Will Eat Ice Cream With PM Modi
x

ప్రధాని మోడీ తో కలసి ఐస్ క్రీం తిన్న పీవీ సింధు (ఫైల్ ఇమేజ్)

Highlights

PV Sindhu: టోక్యో వెళ్లిన బృందంలో మోడీతో ప్రత్యేక భేటీ

PV Sindhu: టోక్యో ఒలింపిక్స్ లో భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టిన అథ్లెట్స్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు.. ఈ బృందంలో బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కూడా ఉన్నారు. ప్లేయర్స్‌కు ప్రధాని తన నివాసంలో అల్పహార విందు ఇచ్చారు. ఈ సమయంలో స్టార్ షట్లర్ పీవీ సింధు తో కలిసి ప్రధాని ఐస్ క్రీమ్ తిన్నారు. టోక్యో గేమ్స్ వెళ్లేముందు అథ్లెట్లతో ముచ్చటించిన సమయంలో.. పతకంతో తిరిగి వచ్చాక ఐస్ క్రీమ్ తిందామని సింధుతో మోడీ చెప్పారు. ఆ మాటలను మోడీ నిలబెట్టుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటకు కూడా అథ్లెట్లను ఆహ్వానించి ప్రత్యేకంగా ప్రశంసల జల్లు కురిపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories