అద్వానీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన ప్రధాని మోదీ

అద్వానీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన ప్రధాని మోదీ
x
Highlights

నేడు అద్వానీ పుట్టినరోజు సందర్బంగా అయన నివాసానికి వెళ్ళడం జరిగింది.. ఆయనతో సమయం గడపటం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. పార్టీ కార్యకర్తలకు, దేశానికి ఆయ‌న‌ సజీవ ప్రేరణ. ఆయ‌న జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను

బీజేపీ కురవ్రుద్దుడు, భారత మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ నేడు 93వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయనకి ప్రముఖ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. ఇక అయన పుట్టినరోజు వేడుకలను భారత ప్రధాని మోడీ దగ్గర ఉండి జరిపించారు.. ఆదివారం ఎల్‌కే అద్వానీ ఇంటికి వెళ్ళిన ప్రధాని, అద్వానీ ఆశీర్వాదం తీసుకొని అనంతరం కేక్‌ కట్‌ చేయించారు.. దీనికి సంబంధించిన ఫోటోలను మోడీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు..

"నేడు అద్వానీ పుట్టినరోజు సందర్బంగా అయన నివాసానికి వెళ్ళడం జరిగింది.. ఆయనతో సమయం గడపటం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. పార్టీ కార్యకర్తలకు, దేశానికి ఆయ‌న‌ సజీవ ప్రేరణ. ఆయ‌న జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను " అని మోడీ ట్వీట్ చేశారు.. మోడీతో పాటుగా హోం శాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా కూడా ఉన్నారు.. అటు 1927 నవంబర్ 8న అప్పటి ఉమ్మడి భారత దేశంలోని కరాచీలో జన్మించారు. దేశవిభజన తర్వాత తన కుటుంబం భారత్‌కు వలస వచ్చింది.


Show Full Article
Print Article
Next Story
More Stories