మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు.. శివసేనకు ఇచ్చిన డెడ్‌లైన్‌ ముగియడంతో ఎన్సీపీకి ఆఫర్‌

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు.. శివసేనకు ఇచ్చిన డెడ్‌లైన్‌ ముగియడంతో ఎన్సీపీకి ఆఫర్‌
x
Highlights

మహారాష్ట్ర రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. బీజేపీ తర్వాత శివసేనకు అవకాశమిచ్చిన గవర్నర్‌ డెడ్‌లైన్ ముగియడంతో ఎన్సీపీకి ఆహ్వానం పలికారు. అయితే,...

మహారాష్ట్ర రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. బీజేపీ తర్వాత శివసేనకు అవకాశమిచ్చిన గవర్నర్‌ డెడ్‌లైన్ ముగియడంతో ఎన్సీపీకి ఆహ్వానం పలికారు. అయితే, ఎన్సీపీ, కాంగ్రెస్‌‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన తీవ్రంగా ప్రయత్నించినా సోనియా నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో శివసేన ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే, గవర్నర్‌ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో మహారాష్ట్ర రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తగినంత సంఖ్యాబలం లేదంటూ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నిరాకరించడంతో ఆ తర్వాత శివసేనను ఆహ్వానించిన గవర్నర్ అంతలోనే షాకిచ్చారు. ఇచ్చిన గడువు ముగియడంతో ఇప్పుడు ఎన్సీపీని పిలిచారు. అయితే, ఎలాగైనాసరే మహారాష్ట్ర పీఠాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతోన్న శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపింది. ఎన్సీపీ కండీషన్ మేరకు కేంద్ర మంత్రివర్గం నుంచి కూడా తప్పుకుంది. అయితే, గవర్నర్ ఇచ్చిన గడువులోపు కాంగ్రెస్‌‌ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో శివసేన ఆశలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

మహారాష్ట్ర పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించిన సోనియాగాంధీ శివసేనకు మద్దతిచ్చే అంశంపై పార్టీ ముఖ్యనేతలతో మంతనాలు జరిపారు. అదే సమయంలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సోనియాకు ఫోన్ చేసి మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే, పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని సోనియా చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రకటన విడుదల చేసిన సీడబ్ల్యూసీ మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలతోను, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

గవర్నర్ ఇచ్చిన గడువు ముగియడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మరో 48గంటలు సమయం ఇవ్వాలని శివసేన కోరింది. అయితే, శివసేన వినతిని తిరస్కరించిన గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీకి ఆహ్వానం పలికారు. దాంతో, మహారాష్ట్ర రాజకీయం మరో మలుపు తిరిగినట్లయ్యింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories