నేడు మరోసారి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ

Congress Central Election Committee Meet again today
x

నేడు మరోసారి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ                  

Highlights

Congress: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

Congress: నేడు మరోసారి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న 4 స్థానాలకు అభ‌్యర్థులకు ఎంపిక చేయనుంది కమిటీ. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో సమావేశం జరగనుంది. ఈనేపథ్యంలో సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు.

ఇప్పటికే 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తాజగా.. మిగిలిన 4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లోక్‌సభ అభ్యర్థులపై నేడు సీఈసీ లో చర్చ జరగనుంది. ఈరోజు రాత్రికి తెలంగాణకు సంబంధించి తుది జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories