ఎన్నికలకు రెండు నెలల ముందు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఎన్నికలకు రెండు నెలల ముందు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
x
Highlights

సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల ముందు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది . కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్...

సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల ముందు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది . కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఛైర్మన్ సుశీల్ చంద్రను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సుశీల్ చంద్ర నియామకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఆమోదముద్ర వేశారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎన్నికల కమిషనర్‌గా చెలామణిలోకి వస్తారని ఉత్తర్వుల్లో రాష్ట్రపతి స్పష్టం చేశారు. కాగా టీ ఎస్‌ క్రిష్ణ మూర్తి తర్వాత ఓ ఐఆర్‌ఎస్‌ అధికారి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడం ఇది రెండో సారి. ఇక సుశీల్ చంద్ర 1980 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన అధికారి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తయారీలో సుశీల్ చంద్ర కీలక పాత్ర పోషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories