సిద్ధగంగ మఠానికి అమిత్ షా..

Amit Shah Visits Siddaganga Mutt
x

సిద్ధగంగ మఠానికి అమిత్ షా..

Highlights

Amit Shah: కర్నాటకలోని తుమకూరులోని సిద్ధగంగ మఠానికి చెందిన శ్రీ శివకుమార స్వామీజీ 115వ జయంతి ఉత్సవాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.

Amit Shah: కర్నాటకలోని తుమకూరులోని సిద్ధగంగ మఠానికి చెందిన శ్రీ శివకుమార స్వామీజీ 115వ జయంతి ఉత్సవాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ప్రధాన కార్యదర్శి సిటి రవి, మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప తదితరులు పాల్గొన్నారు. కాగా, శివకుమార్‌ స్వామీజీ తన కార్యక్రమాల ద్వారా ఎన్నో ఏళ్లుగా గుర్తుండిపోయే సందేశాన్ని ఇచ్చారని, మఠానికి ఎవరు వచ్చినా ఆకలితో తిరిగి వెళ్లరని అమిత్‌ షా కొనియాడారు. సిద్దగంగ మఠానికి మూడో సారి వచ్చానన్నారు. శక్తి, చైతన్యం, ఉత్సాహంతో ఇక్కడి నుంచి వెళ్లాననీ షా చెప్పారు. అటల్ వాజ్ పేయ్ ఇక్కడికి వచ్చినపుడు ఉత్తరాన గంగ, దక్షినాన సిద్ధగంగ అని అంటుండేవారని షా గుర్తు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories