VirataParvam: ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

VirataParvam Release Only in Theaters
x

విరాట ప‌ర్వం పోస్టర్లు (ఫొటో ట్విట్టర్)

Highlights

VirataParvam: విలక్షణ నటుడు రానా దగ్గుబాటి, ఫిదా పేమ్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'విరాట పర్వం'.

VirataParvam: విలక్షణ నటుడు రానా దగ్గుబాటి, ఫిదా ఫేమ్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'విరాట పర్వం'. ఈ సినిమాను డైరెక్టర్ వేడు ఊడుగుల తెరకెక్కిస్తున్నాడు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. కానీ, కరోనాతో రిలీజ్ ఆగిపోయింది. వాస్తవానికి ఏప్రిల్ 30నే సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతున్నట్లు వస్తున్న వార్తలపై డైరెక్టర్ వివరణ ఇచ్చారు.

విరాటపర్వం సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసే ఉద్దేశం లేద‌ని అన్నారు. ఎప్ప‌టికైనా థియేట‌ర్ల‌లోనే విడుదల చేస్తామ‌ని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనాతో థియేటర్లు మూదపడ్డాయని, ప‌రిస్థితులు ఓ కొలిక్కి వచ్చాక కొత్త విడుద‌ల తేదీని వెల్లడిస్తామని తెలిపారు. పీరియాడిక‌ల్ డ్రామాగా రానున్న ఈ చిత్రంలో ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ద‌గ్గుబాటి సురేశ్ బాబు, సుధాక‌ర్‌ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories