Drishyam 2: ప్రారంభమైన 'దృశ్యం2' సినిమా

Drishyam 2: ప్రారంభమైన దృశ్యం2 సినిమా
x

file Image

Highlights

Drishyam 2: మలయాళంలో తెరకెక్కించిన దర్శకుడు జీతూ జోసెఫ్ ‘దృశ్యం2’తో తెలుగులో పరిచయం అవుతున్నారు.

Drishyam 2: వెంకటేష్ కథానాయుడుగా నటించిన 'దృశ్యం' ప్రేక్షకుల్నిఎంతగానో అలరించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ 'దృశ్యం2' రూపొందిస్తున్నారు. మలయాళంలో తెరకెక్కించిన దర్శకుడు జీతూ జోసెఫ్ 'దృశ్యం2'తో తెలుగులో పరిచయం అవుతున్నారు. డి.సురేష్‌బాబు, ఆంటోని పెరుంబవూర్‌, రాజ్‌కుమార్‌ సేతుపతి నిర్మిస్తున్నారు. మంగళవారం రామానాయుడు స్టుడియో లో లాంఛనంగా ఆరంభమైంది. ఈ సినిమా ప్రారంభానికి డి.సురేష్‌బాబు కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, ఐరా కృష్ణ పొట్లూరి క్లాప్‌ కొట్టారు. ఈ నెల 5 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. కొవిడ్‌ ప్రభావం ఇంకా తగ్గని కారణంగా పరిమిత సిబ్బందితోనే చిత్రీకరణ చేయనున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే మలయాళంలో తెరకెక్కిన 'దృశ్యం 2' ప్రముఖ ఓటీటీ ఆమెజాన్‌లో విడుదలై విమర్శకుల ప్రసంశలు అందుకుంది. పార్ట్‌-3కి కూడా డైరెక్టర్‌ జీతూ స్క్రిప్ట్‌ను మలిచే పనిలో ఉన్నట్టు ఇటీవలే వెల్లడించారు. మరోవైపు వెంకీ నటించిన 'నారప్ప'తో పాటు 'ఎఫ్‌3' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories