సాయి తేజ్ చిత్రలహరి...మూడు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా..

సాయి తేజ్ చిత్రలహరి...మూడు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా..
x
Highlights

వరుసగా ఆరు డిజాస్టర్ లతో సతమతమవుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మార్కెట్ బాగా పడిపోయిన సంగతి తెలిసిందే. 'తేజ్ ఐ లవ్ యు' సినిమా తరువాత కొన్ని నెలలు...

వరుసగా ఆరు డిజాస్టర్ లతో సతమతమవుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మార్కెట్ బాగా పడిపోయిన సంగతి తెలిసిందే. 'తేజ్ ఐ లవ్ యు' సినిమా తరువాత కొన్ని నెలలు బ్రేక్ తీసుకుని కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా చేశాడు మెగా మేనల్లుడు. సాయి తేజ్ గా పేరు మార్చుకుని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. కళ్యాణి ప్రియదర్శన్, నివేదపేతురాజ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదలైంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ అందడంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ కూడా లభించాయి.

కేవలం మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల వరకు వసూళ్లు నమోదు చేసింది. సాయి ధరమ్ తేజ్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుంటే ఇవి చాలా మంచి నంబర్లు గా పరిగణించవచ్చు. పైగా ఎన్నికల హడావిడి ముగిసిన తరువాత విడుదల అవడం వలన ఈ చిత్రం మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంది. ఒకవేళ ఇదే జోరు గనక కొనసాగిస్తే ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో హిట్ గా మారుతుంది. తెలుగు రాష్ట్రంలోనే కాక ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం వసూళ్లు బాగానే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories