'ఎన్టీఆర్ కథానాయకుడు'పై లక్ష్మీపార్వతి ఏమన్నారో తెలుసా..?

ఎన్టీఆర్ కథానాయకుడుపై లక్ష్మీపార్వతి ఏమన్నారో తెలుసా..?
x
Highlights

ప్రఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం కథానాయకుడు ఇవాళ విడుదల అయింది....

ప్రఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం కథానాయకుడు ఇవాళ విడుదల అయింది. ఈ సినిమాకు బెనిఫిట్ షో నుంచే హిట్ టాక్ వచ్చింది. సినీప్రముఖులు అందరూ ఈ సినిమాను పొగిడేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి మాత్రం ఈ సినిమా పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ బయోపిక్‌ను చూడమని నన్నెవరూ కోరలేదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కనుసన్నలలోనే ఈ చిత్రం రూపొందింది.

అందువలన ఎన్టీఆర్‌కి సంబంధించిన పూర్తి వాస్తవాలు తెరకెక్కే అవకాశం లేదు. నిజమైన అభిమానుల్లోనూ ఈ సినిమాపై ఎలాంటి ఆసక్తి లేదు. అందరూ కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల కోసమే ఎదురుచూస్తున్నారు. ఉన్నది ఉన్నట్టుగా ఎన్టీఆర్ బయోపిక్‌ను రూపొందించే ధైర్యం రామ్ గోపాల్ వర్మకి మాత్రమే ఉందని అని ఆమె అన్నారు. దాంతో బాలయ్య అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. కాగా ఈ సినిమాను చూసిన తెలుగుదేశం పార్టీ నేతలు బాలయ్యను అభినందించారు.

''

Show Full Article
Print Article
Next Story
More Stories