యువ హీరోతో రొమాన్స్ చేయబోతున్న నిత్యామీనన్

యువ హీరోతో రొమాన్స్ చేయబోతున్న నిత్యామీనన్
x
Highlights

వరుస డిజాస్టర్ లతో సతమతమయిన యువ హీరో రాజ్ తరుణ్ మార్కెట్ బాగా పడిపోయిందని చెప్పుకోవాలి. ఈ మధ్యనే విడుదలైన 'లవర్' సినిమా కూడా డిజాస్టర్ గా మారడంతో రాజ్...

వరుస డిజాస్టర్ లతో సతమతమయిన యువ హీరో రాజ్ తరుణ్ మార్కెట్ బాగా పడిపోయిందని చెప్పుకోవాలి. ఈ మధ్యనే విడుదలైన 'లవర్' సినిమా కూడా డిజాస్టర్ గా మారడంతో రాజ్ తరుణ్ ఇంక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాడేమో అని అందరు అనుకున్నారు. అయితే తాజాగా ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో రాజ్ తరుణ్ 'ఇద్దరిదీ ఒకటే లోకం' అనే ఒక సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. నితిన్ కి 'గుండెజారి గల్లంతయ్యిందే' లాంటి హిట్ అందించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

'ఒక లైలా కోసం' సినిమా తో డిజాస్టర్ అందుకున్న విజయ్ కుమార్ కొండ వ్యక్తిగత జీవితంలో కూడా ఈ మధ్యనే ఒక వివాదంలో చిక్కుకుని బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఆశిస్తున్నాడు. ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో కథ ప్రకారం హీరో తన కంటే వయసులో పెద్దదైన హీరోయిన్ ని ప్రేమిస్తాడు అని తెలుస్తోంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన నిత్యమీనన్ హీరోయిన్ గా నటిస్తోంది అని వార్తలు బయటకు వచ్చాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories