మహేష్ తో సినిమా మా వల్లకాదు అన్నారట ?

మహేష్ తో సినిమా మా వల్లకాదు అన్నారట ?
x
Highlights

డిస్ట్రిబ్యూషన్ సంస్థగా మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీస్ వారు సినీ నిర్మాణ సంస్థగా మారిన విషయం తెల్సిందే. మొదటి మూడు సినిమాలు బ్లాక్ బస్టర్...

డిస్ట్రిబ్యూషన్ సంస్థగా మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీస్ వారు సినీ నిర్మాణ సంస్థగా మారిన విషయం తెల్సిందే. మొదటి మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ అయినప్పటికీ, వరుసగా 'సవ్యసాచి', 'అమర్ అక్బర్ ఆంటోనీ' ఫ్లాప్ అవ్వడంతో కష్టాల్లో కూరుకు పోయింది. ఈ రెండు సినిమాలు మాత్రమే కాక మరికొన్ని సినిమాలపై కూడా వీరు పెట్టిన పెట్టుబడి తిరిగి వెనక్కి రాలేదట. ఈ నేపద్యంలో వారు మహేష్ బాబుతో నిర్మించాల్సిన సినిమాను వదలుకున్నట్లుగా కొందరు చెబుతున్నారు. మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను మైత్రి వారు నిర్మించాల్సి ఉంది.

కానీ భారీ బడ్జెట్ తో సినిమా తమ వల్ల కాదని సుకుమార్ తో చెప్పారట. ఆయన వెళ్లి మహేష్ కు చెప్పి కొంత సమయం అడిగాడని ఆ గ్యాప్ లో అనీల్ రావిపూడితో సినిమాను చేసేందుకు మహేష్ ఒప్పుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మైత్రి వారు మూడు చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. ఆ చిత్రాలకు పెట్టుబడి పెట్టడంతో ఆర్థికంగా కొంచెం కష్టాల్లో ఉన్న సమయంలో మహేష్ బాబుతో సినిమా అంటే కష్టమని మైత్రి వారు భావించారట. అందుకే సినిమాను క్యాన్సిల్ చేశారట.

Show Full Article
Print Article
Next Story
More Stories