రాజకీయం ఒక రొచ్చు.. రజనీకాంత్ మిత్రుడు కీలక వ్యాఖ్యలు

రాజకీయం ఒక రొచ్చు.. రజనీకాంత్ మిత్రుడు కీలక వ్యాఖ్యలు
x
Highlights

టి రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించిన రజనీ తర్వాత యూటర్న్ తీసుకున్నారు.

ఫిల్మీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్, మోహన్ బాబులకు మధ్య ఉన్నస్నేహం గురించి అందరికి తెలిసిందే. రజనీకాంత్ అనారోగ్యంపాలైనప్పుడు మోహన్ బాబు ఆందోళన చెందిన విషయం తెలిసిందే. మొదటి రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించిన రజనీ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని ఆయన తెలిపారు. దీంతో, ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా తన మిత్రుడు రజనీకి మద్దతుగా మోహన్ బాబు ఓ పోస్టు చేశారు. 'రజనీకాంత్ నాకు అత్యంత ఆత్మీయుడు అన్న సంగతి మీకందరికీ తెలుసు. తన ఆరోగ్యరీత్యా రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన ప్రకటించాడు. ఒక రకంగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మీకు, అభిమానులందరికీ బాధే అయినప్పటికీ ఒక స్నేహితుడిగా తన ఆరోగ్యం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మంచిదని నమ్ముతున్నారు.

నా మిత్రుడితో ఎన్నో సందర్భాల్లో చెప్పాను. నువ్వు చాలా మంచివాడివి, చీమకు కూడా హాని చేయనివాడిని, నా దృష్టిలో గొప్ప వ్యక్తులలో ఒకడివి. నీలాంటి వ్యక్తికి, నాలాంటి వ్యక్తికి రాజకీయాలు పనికిరావు. ఎందుకంటే, మనం ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడతాం. ఎవరికీ ద్రోహం చెయ్యం. డబ్బులిచ్చి ఓట్లు, సీట్లు కొనలేము. కొనము కూడా. ఇక్కడ ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో కూడా తెలియదు. రాజకీయాల్లోకి రానంత వరకు మంచివాడివి అన్న నోళ్లే, రేపు వచ్చాక చెడ్డవాడివి అంటాయి.

రాజకీయం ఒక రొచ్చు, ఒక బురద. ఆ బురద అంటుకోకుండా నువ్వు రాకపోవడమే మంచిది అయ్యింది. రజనీకాంత్ అభిమానులందరూ ఆయన అంత మంచి వాళ్లు. మీరందరూ సహృదయంతో నా మిత్రుడి నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను' అని మోహన్ బాబు కోరారు. రజనీకాంత్ పార్టీ ప్రకటన విరమించుకోగానే అభిమానులు తీవ్ర నిరాశకు గురైయ్యారు. ప్రత్యర్థులైతే సంతోషం వ్యక్తం చేశారు. కొందరూ సినీనటులు కూడా రజనీ వయస్సు రిత్యా రాజకీయాల్లోకి రాకపోవడమే బెటర్ అంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అయితే మోహన్ బాబు ప్రస్తుతం యాక్టివ్ రాజకీయాల్లో అయితే లేరు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే .

Show Full Article
Print Article
Next Story
More Stories