నిరాశపడుతున్న మహేష్ బాబు అభిమానులు

నిరాశపడుతున్న మహేష్ బాబు అభిమానులు
x
Highlights

ఈమధ్యనే థియేటర్ బిజినెస్ లోకి దూరిన మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ సూపర్ఫ్లెక్స్ బిజినెస్ పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక అద్భుతమైన...

ఈమధ్యనే థియేటర్ బిజినెస్ లోకి దూరిన మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ సూపర్ఫ్లెక్స్ బిజినెస్ పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక అద్భుతమైన ప్లాన్ వేశాడు మహేష్. ప్రఖ్యాత మ్యాడమ్ తుస్సాడ్స్ రూపొందించిన మహేష్ మైనపు విగ్రహాన్ని ఏఎంబీ సినిమాస్ లో లాంచ్ చేయాలని అనుకుంటున్నాడు మహేష్. దీని ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మాల్ కి గుర్తింపు దక్కుతుంది. ఈ ఈవెంట్ కి మీడియా తో పాటు భారీగా ఫ్యాన్స్ కూడా తరలివస్తారు. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట. రేపు (25 మార్చి) జరగనున్న ఈ ఈవెంట్ కి తెలుగు రాష్ట్రాల నుంచి భారీ మొత్తంలో మహేష్ అభిమానులు రానున్నారు.

స్టార్ల మధ్య జరగాల్సిన ఇలాంటి ఈవెంట్ ను అభిమానులకే ప్రాధాన్యతనిచ్చి వారి మధ్య జరుపుతున్నామని నమ్రత టీమ్ ప్రచారం చేస్తోంది. కానీ ప్రతి అభిమానికి మహేష్ ని కలిసే అదృష్టం దొరుకుతుందా అంటే అస్సలు కుదరదని తెలుస్తోంది. ఇప్పటికే ఏఎంబీ మాల్ లో మైనపు విగ్రహావిష్కరణ నేపథ్యంలో అభిమానులకు ఓ కాంటెస్ట్ ని రన్ చేశారు. అందులో నెగ్గిన వారి నుంచి ఫిల్టర్ చేసి ఓ ఐదుగురిని మాత్రమే మహేష్ తో వేదిక మీదకి రానిస్తారు. కానీ కేవలం ఐదుగురికి మాత్రమే ఈ ఛాన్స్ దక్కుతుందని తెలిసి ఇతర అభిమానులు నిరాశకు గురవుతున్నారు. కేవలం ఐదుగురికే ఛాన్స్ ఇస్తే ఎలా అని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. ఏఎంబీలో మహేష్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించి సింగపూర్ మ్యాడమ్ తుస్సాడ్స్ కి తరలిస్తారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories