Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట క్లైమాక్స్ మార్చనున్న పరశురామ్

Mahesh Babu Suggested Director Parasuram to Change the Climax of Sarkaru Vaari Paata Movie
x

సినిమా క్లైమాక్స్ మార్చమంటున్న మహేష్ బాబు

Highlights

* సినిమా క్లైమాక్స్ మార్చమంటున్న మహేష్ బాబు

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమా అయిన "సర్కారు వారి పాట" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మహానటి సినిమా ఫేమ్ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా రాజకీయ బ్యాక్ డ్రాప్తో సాగుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం పరుశురాం ఈ చిత్ర క్లైమాక్స్ కోసం మళ్లీ రీవర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పరశురామ్ రాసిన క్లైమాక్స్ పార్ట్ మహేష్ బాబుకి అంతగా నచ్చలేదట.

దీంతో కొంచెం టైం తీసుకుని మళ్ళీ క్లైమాక్స్ ని మార్చమని మహేష్ బాబు చెప్పారట. ఇక మరోవైపు ఈ సినిమాలో తన పాత్ర పోకిరి సినిమాలో తను చేసిన పాత్ర కి దగ్గరగా ఉంటుందని ఈ సినిమాలో పూరి జగన్నాథ్ స్టైల్, ఫ్లేవర్ ఉంటుందని అన్నారు మహేష్ బాబు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మరియు జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. సముతిరఖని, సుబ్బరాజు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories