మహేష్ ఫ్యాన్స్ లో మొదలైన కంగారు

Mahesh Babu
x
Mahesh Babu
Highlights

టాలీవుడ్ లోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ముందుగా వచ్చే పేరు దేవి శ్రీ ప్రసాద్. ఫాన్స్ అందరు రాక్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే దేవిశ్రీ కి సాటి ఎవరూ లేరు, రారు. అయితే గత కొంత కాలంగా ఫ్యాన్స్ కూడా డిఎస్పీపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

టాలీవుడ్ లోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ముందుగా వచ్చే పేరు దేవి శ్రీ ప్రసాద్. ఫాన్స్ అందరు రాక్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే దేవిశ్రీ కి సాటి ఎవరూ లేరు, రారు. అయితే గత కొంత కాలంగా ఫ్యాన్స్ కూడా డిఎస్పీపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. సంక్రాంతికి విడుదల కానున్న సినిమాల్లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న 'వినయ విధేయ రామ' మరియు వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ సినిమా సినిమాలకు ఆడియో ఇచ్చింది దేవి నే. అయితే ఈ రెండు సినిమాల్లోనూ పాటలు అంతగా ప్రేక్షకులను మెప్పించింది లేదు. గతేడాది 'రంగస్థలం', 'భరత్ అనే నేను' వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత పలు సినిమాలకు సంగీతం అందించినప్పటికీ వాటి క్వాలిటీ బాలేదు అంటూ కామెంట్లు వినిపించాయి.

ఇక ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'మహర్షి' సినిమాకి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది. మహేష్ 25వ సినిమా ఇది. ల్యాండ్ మార్క్ సినిమా కాబట్టి కచ్చితంగా అన్ని రకాలుగా హిట్ అవ్వాలి అంటే సంగీతం పరంగా కూడా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించాలి. కానీ అసలు ఈ మధ్య ఫార్మ్ లో లేని దేవిశ్రీప్రసాద్ ఎలాంటి సంగీతం అందిస్తాడు అని ఫ్యాన్స్ అందరూ భయపడుతున్నారు. ఒకవేళ ఈ సినిమా లో పాటలతో పెద్దగా మెప్పించలేదు అంటే ఇక దేవిశ్రీ కెరీర్ కు పెద్ద ముప్పు పొంచి ఉందని చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories