రెమ్యునరేషన్ పెంచేసిన మహేష్ బాబు హీరోయిన్

రెమ్యునరేషన్ పెంచేసిన మహేష్ బాబు హీరోయిన్
x
Highlights

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మహేష్ బాబు సరసన 'వన్ నేనొక్కడినే' అనే చిత్రంలో నటించి టాలీవుడ్ లో అడుగు పెట్టింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం...

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మహేష్ బాబు సరసన 'వన్ నేనొక్కడినే' అనే చిత్రంలో నటించి టాలీవుడ్ లో అడుగు పెట్టింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మొదటి సినిమా డిజాస్టర్ అయినప్పటికీ నాగ చైతన్య తో రెండవ సినిమా అవకాశం దక్కించుకున్న కృతిసనన్ 'దోచేయ్' సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో ఆమె రూటు మార్చి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. కొన్ని అడపాదడపా సినిమాలు చేసిన తర్వాత ఈ మధ్యనే కార్తిక్ ఆర్యన్ తో 'లుకా చుప్పి' అనే సినిమాలో కనిపించింది.

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుతోంది. ఈ సినిమా ఏకంగా 90 కోట్ల మార్కును రీచ్ అయింది. కృతి కి ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒక సూపర్ హిట్ ను అందించింది ఈ సినిమా. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హిట్ అవడంతో ఈమె వెంటనే తన రెమ్యునరేషన్ని బాగా పెంచింది అని తెలుస్తోంది. ఇప్పటినుండి సినిమాకు ఒకటి లేదా ఒకటిన్నర కోటి రూపాయలు డిమాండ్ చేస్తుందట. ఈమె అందం, టాలెంట్ రెండూ ఎక్కువే కాబట్టి నిర్మాతలు కూడా ఏ మాత్రం ఆలోచించకుండా అడిగినంత ఇచ్చి ఆమెను తీసుకోవడం మొదలు పెట్టారని టాక్.

Show Full Article
Print Article
Next Story
More Stories