టికెట్ రేట్లపై స్పందించిన దిల్‌రాజు.. ఇక నుంచి అన్ని చిత్రాలకు..

Dil Raju Responded on the Ticket Rates | Tollywood News
x

టికెట్ రేట్లపై స్పందించిన దిల్‌రాజు.. ఇక నుంచి అన్ని చిత్రాలకు..

Highlights

*టికెట్ రేట్లపై స్పందించిన దిల్‌రాజు.. ఇక నుంచి అన్ని చిత్రాలకు..

Di Raju: హీరో నాగచైతన్య హీరోగా నటించిన 'థాంక్యూ' సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. 'థాంక్యూ' మూవీ టికెట్ రేట్లపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు స్పందించారు. స్టార్ హీరోల హై బడ్జెట్ చిత్రాలను మినహాయిస్తే.. టికెట్ రేట్లు ఇక నుంచి అన్ని చిత్రాలకు ఒకేలా ఉంటాయన్నారు. హైదరాబాద్, వైజాగ్ లాంటి నగరాల్లో సింగిల్ స్క్రీన్‌‌లో జీఎస్టీతో కలిపి 150 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో 200 రూపాయలు నిర్ణయించామని చెప్పారు. నిర్మాతలందరం కలిసి ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకున్నామని దిల్ రాజు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories