కుమారి 21F‌, పటాస్‌ చిత్రాలను అందుకే వదులుకున్నా : చాందిని చౌదరి

కుమారి 21F‌, పటాస్‌ చిత్రాలను అందుకే వదులుకున్నా : చాందిని చౌదరి
x
Highlights

ముహూర్తం, సాంబార్ ఇడ్లీ మొదలుగు షార్ట్స్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకుంది తెలుగమ్మాయి చాందిని చౌదరి. షార్ట్ ఫిలిమ్స్ తో క్రేజ్ ని సంపాదించుకొని, కేటుగాడు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైంది ఈ భామ.

ముహూర్తం, సాంబార్ ఇడ్లీ మొదలుగు షార్ట్స్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకుంది తెలుగమ్మాయి చాందిని చౌదరి. షార్ట్ ఫిలిమ్స్ తో క్రేజ్ ని సంపాదించుకొని, కేటుగాడు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైంది ఈ భామ. ఆ తర్వాత బ్రహ్మోత్సవం, కుందనపు బొమ్మ, శమంతకమణి మొదలగు చిత్రాలలో నటించినప్పటికీ అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయాయి. కానీ తాజాగా సుహాస్ హీరోగా వచ్చిన కలర్ ఫోటో చిత్రం ఆమెకి మంచి పేరును తీసుకువచ్చింది. ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. అయితే ఈ సినిమా సక్సెస్ తో వరుస అవకాశాలను సొంతం చేసుకుంటున్న ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, తన కెరీర్‌కు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

సినీ కెరీర్లో అందరిలాగే తానూ కూడా సినీ కష్టాలను చూసినట్టుగా వెల్లడించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికి తనకి ఆశించినంతగా పేరు తీసుకురాలేదని చెప్పుకొచ్చింది. అలాంటి సమయంలో కలర్‌ఫొటో చిత్రం తనకి మాంచి విజయాన్ని అందించిందని వెల్లడించింది. అయితే ఆ సినిమాకు ముందు కొన్ని ప్రాజెక్ట్‌లు తన వద్దకు వచ్చినట్టుగా చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఓ ప్రముఖ నిర్మాత దగ్గర తానూ కాంట్రాక్ట్‌లో ఉండడంతో రెండేళ్లపాటు వేరే సినిమాల్లో నటించే అవకాశం లేకుండా పోయిందని చాందిని చెప్పుకొచ్చింది. అలా తానూ కుమారి 21F‌, పటాస్ చిత్రాలను కోల్పోవాల్సి వచ్చిందని వెల్లడించింది. మొత్తానికి తన కష్టానికి కలర్ ఫోటో చిత్రం తగిన ప్రతిఫలాన్ని ఇచ్చిందని వెల్లడించింది చాందిని.

Show Full Article
Print Article
Next Story
More Stories