Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆదిపురుష్ టీమ్ షాకింగ్ నిర్ణయం.. అదేంటంటే..?

Shocking Decision of Adipurush Team About Premier
x

Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆదిపురుష్ టీమ్ షాకింగ్ నిర్ణయం.. అదేంటంటే

Highlights

* సినిమా జూన్ 16న విడుదల కానున్న నేపథ్యంలో ముందుగానే ప్రీమియర్ వేస్తే సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపిస్తుందని మేకర్స్ భావిస్తున్నారా లేదంటే...

Adipurush: డార్లింగ్ ప్రభాస్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. రామాయణం ఇతిహాసంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్..కళ్లు చెదిరే గ్రాఫిక్స్ తో భారీ బడ్జెట్ తో ఆది పురుష్ సినిమాని రూపొందించారు. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అనుమానాలను పటాపంచలు చేయడమే కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అందరిలోనూ అంచనాల్ని పెంచేసింది. ప్రభాస్ కు పాన్ ఇండియా రేంజ్ లో భారీ హిట్ ఖాయమని అందరూ భావిస్తున్న తరుణంలో ఆదిపురుష్ టీమ్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

ఆదిపురుష్ మూవీని ట్రైబెకా ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రదర్శిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. దీనిబట్టి చూస్తే, థియేటర్స్ లో రిలీజ్ కి మూడు రోజుల ముందే అంటే జూన్ 13న ప్రీమియర్ షోలు పడాలి. ఇప్పుడు వాటిని ఆదిపురుష్ నిర్మాతలు క్యాన్సిల్ చేశారు. జూన్ 15న సాయంత్రం ప్రీమియర్ షోలు వేయాలని డిసైడ్ అయ్యారు. జూన్ 17న మధ్యాహ్నం 12 గంటలకు మరో షో వేస్తున్నారు. చెప్పాలంటే దీనికంటే ముందు అమెరికాలో ప్రీమియర్ షోలు పడతాయి.

జూన్ 13న వేయాల్సిన ఆదిపురుష్ ప్రీమియర్ షోలను దర్శకనిర్మాతలు ఎందుకు క్యాన్సిల్ చేశారనేది ఇప్పుడు ఫ్యాన్స్ తో పాటు అందరిలోనూ సందేహాలను కలిగిస్తోంది. రిలీజ్ కి రెండు రోజుల ముందే షోలు పడితే రివ్యూలు బయటకు వస్తాయని..ఈ రివ్యూలు ఏమాత్రం తేడా కొట్టినా బాక్సాఫీస్ ఓపెనింగ్స్ తో పాటు రిజల్ట్ పై కూడా ప్రభావం చూపిస్తుందని మేకర్స్ భావించినట్లు ఉంది. అందుకే ప్రీమియర్స్ ని రద్దు చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో గ్రాఫిక్స్ కి సంబంధించిన షాట్స్ ను పూర్తిగా చూపించకుండా ఆదిపురుష్ టీమ్ సేఫ్ గేమ్ ఆడింది. అప్పుడు పెద్దగా అనుమానాలు కలుగలేదు కానీ, ప్రీమియర్స్ ను వాయిదా వేయడంతో ఆదిపురుష్ నిర్మాతలు ఏదో దాస్తున్నారని పలువురు సందేహపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories