వ్యూహాత్మకంగా అభ్యర్ధులను ప్రకటించిన జగన్‌..సిట్టింగ్ ఎంపీల్లో కేవలం ఇద్దరికే...

వ్యూహాత్మకంగా అభ్యర్ధులను ప్రకటించిన జగన్‌..సిట్టింగ్ ఎంపీల్లో కేవలం ఇద్దరికే...
x
Highlights

అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల పేర్ల ప్రకటనలో వైసీపీ దూకుడుగా వ్యవహరించింది. ఒకేసారి 175 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన వైసీపీ లోక్ సభ...

అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల పేర్ల ప్రకటనలో వైసీపీ దూకుడుగా వ్యవహరించింది. ఒకేసారి 175 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన వైసీపీ లోక్ సభ అభ్యర్థుల తుది జాబితాను సైతం విడుదల చేసింది. సిట్టింగ్ ఎంపీల్లో కేవలం ఇద్దరికే మళ్లీ టికెట్లు లభించాయి.

వైసీపీ లోక్ సభ అభ్యర్థుల తుది జాబితా ప్రకటించింది. నిన్న ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీ నేత నందిగం సురేశ్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. శనివారం తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మిగిలిన 16 మంది అభ్యర్థుల జాబితాను నిన్న నందిగం సురేశ్‌ విడుదల చేశారు.

వైసీపీ తరపున లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థులు వీరే.

1. కడప - వైఎస్‌ అవినాష్‌రెడ్డి

2. రాజంపేట - పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

3. చిత్తూరు - నల్లకొండగారి రెడ్డప్ప

4. తిరుపతి - బల్లె దుర్గాప్రసాద్‌

5. హిందుపురం - గోరంట్ల మాధవ్‌

6. అనంతపురం - తలారి రంగయ్య

7. కర్నూలు - డాక్టర్‌ సింగరి సంజీవ్‌కుమార్‌

8. నంద్యాల - పీ బ్రహ్మానందరెడ్డి

9. నెల్లూరు - ఆదాల ప్రభాకర్‌రెడ్డి

10. ఒంగోలు - మాగుంట శ్రీనివాస్‌రెడ్డి

11. బాపట్ల - నందిగం సురేశ్‌

12. నరసారావుపేట - లావు కృష్ణదేవరాయలు

13. గుంటూరు - మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి

14. మచిలీపట్నం - బాలశౌరి

15. విజయవాడ - పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)

16. నరసాపురం - రఘురామ కృష్ణంరాజు

17. రాజమండ్రి - మంగన భరత్‌

18. అమలాపురం - చింతా అనురాధ

19. అనకాపల్లి - డాక్టర్‌ వెంకట సత్యవతి

20. కాకినాడ - వంగా గీత

21. ఏలూరు - కోటగిరి శ్రీధర్‌

22. శ్రీకాకుళం - దువ్వాడ శ్రీనివాసరావు

23. విశాఖపట్నం - ఎంవీవీ సత్యనారాయణ

24. విజయనగరం - బెల్లాని చంద్రశేఖర్‌

25. అరకు - గొడ్డేటి మాధవి

సిట్టింగ్ ఎంపీలు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మిథున్ రెడ్డిలకు మళ్లీ టికెట్లు దక్కగా, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బుట్టా రేణుకాకు టికెట్లు లభించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories