ఏపీ సీఈవోకు సునీతా రెడ్డి ఫిర్యాదు..

ఏపీ సీఈవోకు సునీతా రెడ్డి ఫిర్యాదు..
x
Highlights

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును పక్కదారి పట్టించేలా టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారంటూ ఆయన కుమార్తె సునీతా రెడ్డి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి...

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును పక్కదారి పట్టించేలా టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారంటూ ఆయన కుమార్తె సునీతా రెడ్డి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఈసీ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదికి విన్నవించారు. దీనికి సంబంధించిన పేపర్ క్లిప్పింగులను ప్రధాన ఎన్నికల అధికారికి తన భర్త రాజశేఖరరెడ్డితో కలిసి సునీతారెడ్డి అందచేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు విచారణాధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్. సునీతా రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి నేతలు ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్. సునీతా రెడ్డి ఈసీని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories