బాబును ఓడించేందుకు ఏపీలో ప్రచారం చేస్తాం..

బాబును ఓడించేందుకు ఏపీలో ప్రచారం చేస్తాం..
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాలన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఓడిచేందుకు టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారం చేస్తుందని తెరాస ఎంపీ సీతారాం నాయక్ స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాలన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఓడిచేందుకు టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారం చేస్తుందని తెరాస ఎంపీ సీతారాం నాయక్ స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల సమావేశం కేవలం ఫెడరల్ ఫ్రంట్ కోసమేనని ఇందులో మరేతర విషయాలు లేవన్నారు. అసలు ఫెడరల్ ఫ్రంట్ వెనక బీజేపీ పార్టీ ఉందని వస్తున్న వార్తాలు పూర్తి అవస్తవమేనని కొట్టిపారేశారు. కేవలం భారత దేశంలో గుణాత్మక మార్పు రావాలన్న నినాదంతో సీఎం కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రస్తావించారని అన్నారు. అందులో భాగంగానే కేసీఆర్ రాష్ట్రాల పర్యటన చేపట్టారని గుర్తుచేశారు. ఇటివల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు తెలంగాణలో పర్యటించలేదా అని ఎంపీ సీతారాం నాయక్ ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories