రేపిస్ట్‌లకు అది కట్ చేయాలి.. రష్మి సంచలన వ్యాఖ్యలు

రేపిస్ట్‌లకు అది కట్ చేయాలి.. రష్మి సంచలన వ్యాఖ్యలు
x
Highlights

జబర్థస్త్ యాంకర్, సినీ నటి రష్మి గౌతమ్‌ వెండితెరపై, వివిధ షోస్ లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక అప్పడప్పుడు సోషల్ మీడియాలో పలు విషయాలపై...

జబర్థస్త్ యాంకర్, సినీ నటి రష్మి గౌతమ్‌ వెండితెరపై, వివిధ షోస్ లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక అప్పడప్పుడు సోషల్ మీడియాలో పలు విషయాలపై స్పందిస్తూ యాక్టివ్‌ ఉంటుంది రష్మీ. ఈ నేపథ్యంలో అత్యాచారాలకు ఒడిగడుతున్న నరరూప రాక్షసులపై రష్మీ గౌతమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బీహార్‌లో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేయడానికి అడ్డుకునేందుకు ఆ యువతి యత్నించగా ఆమెపై యాసిడ్‌ దాడి చేశారు.

ఈ ఘటనపై ట్విటర్‌ వేదికగా రష్మి స్పందించారు. రోజుకో కొత్త కేసు నమోదవుతోంది. గతంలో జరిగిన ఘటనల కంటే ప్రస్తుతం జరిగే ప్రతీ ఘటన చాలా భయానకంగా ఉంటోంది. మగాళ్లమని రెచ్చిపోతూ అఘాయిత్యాలకు పాల్పడే కామాంధుల పురుషాంగాలను కోసేయాలని లేకపోతే ఒక్క రాత్రిలోనే స్త్రీ అన్నది కనిపించకుండా పోతుంది. అలా చేసినప్పుడే మానవాళికి మహిళ విలువ తెలుస్తుందని ట్వీట్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories