సైకో శ్రీనివాస రెడ్డి చెప్పిన సమాధానాలు వింటే ఎవరైనా షాక్‌కు గురికావాల్సిందే...

సైకో శ్రీనివాస రెడ్డి చెప్పిన సమాధానాలు వింటే ఎవరైనా షాక్‌కు గురికావాల్సిందే...
x
Highlights

సంచలనం సృష్టించిన హాజీపూర్‌ వరుస హత్యల కేసు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి కస్టడీ ముగిసింది. మరి కస్టడీలో శ్రీనివాస్‌రెడ్డి నుంచి పోలీసులు ఎలాంటి సమాచారం...

సంచలనం సృష్టించిన హాజీపూర్‌ వరుస హత్యల కేసు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి కస్టడీ ముగిసింది. మరి కస్టడీలో శ్రీనివాస్‌రెడ్డి నుంచి పోలీసులు ఎలాంటి సమాచారం రాబట్టారు. సైకో కిల్లర్‌ అసలు నోరు విప్పలేదని చెబుతున్నా.. అతన్నుంచి రాబట్టిన సంచలన విషయాలేంటి..? ఆరు రోజుల కస్టడీ విచారణపై‌.. హెచ్‌ఎం టీవీ స్పెషల్‌ రిపోర్ట్

శ్రీనివాస్‌రెడ్డి మైనర్‌ బాలికలను అతి క్రూరంగా హతమార్చిన నరరూప రాక్షసుడు. ఆ సైకో కిల్లర్‌ను 6 రోజుల పాటు రాచకొండ సిట్‌ బృందం విచారించింది. అతడి కిరాతకాలకు బలైంది ఆ ముగ్గురు బాలికలేనా..? లేక ఇంకెవరైనా ఉన్నారా..? అన్నదానిపై సమాధానాలు రాబట్టింది. అంతేకాదు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ కూడా చేసి కీలక వివరాలను సేకరించింది.

కర్నూలులో మహిళ మర్డర్‌ కేసు నుంచి హాజీపూర్‌లో ముగ్గురు బాలికల హత్య వరకు ఎక్కడ ఎలా చేశాడో విచారణలో వివరాలు సేకరించారు. ఈ హత్యలకు ఎవరైనా సహకరించారా..? అన్న కోణంలో సమాధానాలు రాబట్టారు. తాను చేసిన తప్పులు ఊళ్లో వారికి తెలుస్తుందన్న భయంతోనే ఇద్దరు అమ్మాయిలను చంపినట్లు శ్రీనివాస్‌రెడ్డి ఒప్పుకున్నాడు. ఈ విచారణలోనే మైసిరెడ్డిపల్లి గ్రామంలో ఓ మహిళపై అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించినట్టు తెలుస్తోంది.

కస్టడీలో పోలీసులు శ్రీనివాస్‌రెడ్డి చేత సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయించారు. హాజీపూర్‌తో పాటు మహబూబ్‌నగర్‌, భువనగిరి, కరీంనగర్‌ జిల్లాల్లో గత ఆరేళ్లుగా మిస్సింగ్‌ కేసుల వివరాలపై కూడా శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు.

అసలు శ్రీనివాస్‌రెడ్డి సైకో కిల్లర్‌గా ఎందుకు మారాడు..? మైనర్లను మర్డర్‌ చేయడం వెనుక బలమైన కారణం ఏదైనా ఉందా..? మరి శ్రీనివాస్‌రెడ్డి ఎందుకు సైకోలా మారిపోయాడు..? ఎందుకు అమ్మాయిలపై క్రూరంగా ప్రవర్తిస్తూ.. హత్యలు చేస్తున్నాడు..? ఈ ప్రశ్నలకు సైకో శ్రీనివాస రెడ్డి చెప్పిన సమాధానాలు వింటే ఎవరైనా షాక్‌కు గురికావాల్సిందే.

జులాయిగా తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేసిన శ్రీనివాస్‌రెడ్డి అమ్మాయిలు కనబడితే మృగంలా మారిపోతాడని వారిని అనుభవించాలనే పిచ్చితో రగిలిపోతాడని పోలీసుల విచారణలో తేలింది. శ్రీనివాస్‌రెడ్డిలో ఈ విపరీత ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది.

వయస్సు వచ్చినా శ్రీనివాస్‌రెడ్డికి పెళ్లి కాకపోవడం అతడికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇలా సైకోలా తయారైనట్లు చెబుతున్నారు. దీంతో పాటే పోర్న్‌ సైట్లు బాగాచూసేవాడని దాంతో మరింత రెచ్చిపోయి జంతువులా మారిపోయేవాడని పోలీసులు తెలుసుకున్నారు. కంటికి కనబడ్డ మహిళలు, విద్యార్థినులతో కోరిక తీర్చుకోవాలని తీవ్రంగా అనుకునేవాడని శ్రీనివాస్‌రెడ్డి పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

అయితే ఆస్తిపాస్తులున్నా శ్రీనివాస్‌రెడ్డికి పిల్లను ఎందుకు ఇవ్వలేదన్న దానిపై కూడా పోలీసులు కూపీ లాగారు. ఈ విషయంలో గ్రామస్తుల అభిప్రాయాలను తీసుకున్నారు. మొదటి నుంచీ శ్రీనివాస్ రెడ్డి వ్యవహార శైలిపై అందరికి అనుమానం ఉందని అందుకే ఊళ్లో వారంతా అతన్ని దూరంగా ఉంచినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే శ్రీనివాస్‌‌రెడ్డి ఉదంతం తర్వాత హాజీపూర్ చుట్టుపక్క ప్రాంతాలతో పాటు మహబూబ్ నగర్, భువనగిరి, కరీంనగర్ జిల్లాల్లో ఆరేళ్లుగా నమోదైన మిస్సింగ్ కేసులపై ఆరా తీశారు. కనీసం 30 మంది కంప్లైంట్లపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories