పాక్ 70 ఏళ్లలో చేయలేనిది మోదీ-షా ఐదేళ్లలో చేశారు: కేజ్రీవాల్

పాక్ 70 ఏళ్లలో చేయలేనిది మోదీ-షా ఐదేళ్లలో చేశారు: కేజ్రీవాల్
x
Highlights

గడిచిన ఐదేళ్లలో ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దేశాన్ని భ్రష్టుపట్టించారని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. వీరిద్దరి వల్ల దేశ ప్రజలు, యువత ఆందోళన చెందుతున్నారని చెప్పారు.

గడిచిన ఐదేళ్లలో ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దేశాన్ని భ్రష్టుపట్టించారని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. వీరిద్దరి వల్ల దేశ ప్రజలు, యువత ఆందోళన చెందుతున్నారని చెప్పారు. మోడీ అబద్దాలు చెప్పి ఓట్లు దండుకున్నారన్నారు. కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారని ఆరోపించారు. నోట్ల రద్దుతో దేశంలో కోట్ల ఉద్యోగాలు పోయాయని కేజ్రీవాల్ విమర్శించారు. మరో వైపు రైతులు కూడా బీజేపీ ప్రభుత్వం మోసగించిందని ఆరోపించారు. కనీస మద్దతు ధర అడిగినందుకు రైతులపై దుశ్చర్యలకు పాల్పడిన ఘటనలున్నాయన్నారు. మోడీ, అమిత్ షా నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేజ్రీవాల్. అయితే 70 ఏండ్లు పాకిస్తాన్ దేశం చేయలేని పనిని మోడీ, అమిత్‌షాలు చేశారు. కేవలం ఐదేళ్లలో దేశాన్ని విడగొట్టారని ఆరోపించారు. మతల మధ్య చిచ్చులు పెట్టి దేశాన్ని విడగొట్టిందని తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories