చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి అందుకే ఈ యాగాలు : ఎంపీ రాయపాటి

చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి అందుకే ఈ యాగాలు : ఎంపీ రాయపాటి
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసి ఫలితాలకు ముస్తాబు అవుతున్నాయి . ఈ తరుణంలో చంద్రబాబు మళ్ళి సీఎం కావాలని టిడిపి నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు...


ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసి ఫలితాలకు ముస్తాబు అవుతున్నాయి . ఈ తరుణంలో చంద్రబాబు మళ్ళి సీఎం కావాలని టిడిపి నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు యాగాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మొర్జంపాడు శ్రీ బుగ్గమల్లేశ్వరస్వామి క్షేత్రంలో గురువాం శత చండీయాగం, మహాసుదర్శన యాగాలు నిర్వహించారు. చల్లా శ్రీనివాసశర్మ ఆధ్యర్యంలో పదుల సంఖ్యలో రుత్వికులు శాస్త్రోక్తంగా యాగ కృతువు నిర్వహించారు...

గురువారం మొదలైన ఈ యాగం ఐదువ రోజైన పూర్ణాహుతితో సమాప్తి అవుతుందని శ్రీనివాసశర్మ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ ఆంధ్రప్రదేశ్ కి మళ్ళి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని అందుకోసమే ఈ యాగాలు నిర్వహిస్తునట్లు తెలిపారు .రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు హయాంలో నిర్మితమైన శ్రీ బుగ్గమల్లేశ్వర స్వామీ ఆలయం శ్రీశైల దేవస్థానంతో సమానమైన ప్రాశస్థ్యం పొందిందని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories