కర్నూలు జిల్లాలో మారుతున్న రాజకీయాలు...ఎస్వీ మోహన్‌రెడ్డితో...

కర్నూలు జిల్లాలో మారుతున్న రాజకీయాలు...ఎస్వీ మోహన్‌రెడ్డితో...
x
Highlights

కర్నూలు జిల్లాలో రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. వైసీపీ అభ్యర్ధుల జాబితా ఖరారు చేయడంతో టీడీపీ నుంచి ఆశావాహులు భారీగా పోటీ పడుతున్నారు. ...

కర్నూలు జిల్లాలో రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. వైసీపీ అభ్యర్ధుల జాబితా ఖరారు చేయడంతో టీడీపీ నుంచి ఆశావాహులు భారీగా పోటీ పడుతున్నారు. కర్నూలు టికెట్ కోసం పట్టుబట్టిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. టీడీపీ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారాలంటూ కార్యకర్తలు సూచించినట్టు సమాచారం. టీడీపీ వైఖరిపై ఎస్వీ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం అందుకున్న వైసీపీ నేతలు ఆయనతో చర్చలు జరిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు నియోజకవర్గాల్లో బలమైన అనుచరవర్గం కలిగిన మోహన్ రెడ్డిని వైసీపీలోకి తెచ్చేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్ధులను ప్రకటించినందున ఎమ్మెల్సీ ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చినట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories