కుర్రాడిని నిలబెట్టి జగన్‌ను ఓడిస్తా: కేఏ పాల్

కుర్రాడిని నిలబెట్టి జగన్‌ను ఓడిస్తా: కేఏ పాల్
x
Highlights

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఎప్సడు సంచలన వ్యాఖ్యాలు చేస్తూ వార్తాల్లో నిలుస్తుంటాడు. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలో...

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఎప్సడు సంచలన వ్యాఖ్యాలు చేస్తూ వార్తాల్లో నిలుస్తుంటాడు. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలో ప్రచారంలోదూసుకపోతున్నాయి. కాగా ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. కాగా పులివెందులలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. కాగా దీనిపై కేఏ పాల్ మాట్లాడుతూ పులివెందులలో ప్రజాశాంతి పార్టీ తరుపున చిన్నకుర్రాడిని నిలబెట్టి జగన్‌ను ఓడిస్తానని చెప్పారు. పులివెందులలో వైయస్ జగన్‌ మోహన్ రెడ్డిపై మంచి వ్యక్తిని ప్రజాశాంతి పార్టీ తరుపున బరిలోకి దింపామని కేఏ పాల్ తెలిపారు. అయితే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దగ్గర లక్ష కోట్ల రూపాయలున్నాయని, తమ అభ్యర్థి దగ్గర కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. హెలీకాప్టర్ గుర్తుకు ఓటు వేసి జగన్‌ను ఇంటికి పంపాలని పాల్ పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్‌కు ఓటు వేయకూడదని, ఒక్క హెలీకాప్టర్ గుర్తుకు ఓటు వేయాలని పాల్ పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories