రైతులకు చల్లని కబురు...జూన్ మొదటి వారంలో...

రైతులకు చల్లని కబురు...జూన్ మొదటి వారంలో...
x
Highlights

భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. 2019 నైరుతి రుతుపవనాల వర్షపాతంపై...

భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. 2019 నైరుతి రుతుపవనాల వర్షపాతంపై అంచనాలను వెల్లడించింది. ఈ ఏడాది జూన్ మొదటి వారంలో కేరళను రుతుపవనాలు తాకనున్నట్టు వెల్లడించింది. రైతులకు ఖరీఫ్ సీజన్ ఉపయోగకరంగా ఉంటుందని, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది. జూన్ లో వర్షపాతంపై రెండో విడత అంచనాలను విడుదల చేస్తామని, దీర్ఘకాలికంగా 96 శాతం వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories