రాష్ట్రంలో జగన్ ప్రభంజనం : గోపిరెడ్డి

రాష్ట్రంలో జగన్ ప్రభంజనం : గోపిరెడ్డి
x
Highlights

ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహ‍న్ రెడ్డి ప్రభంజనం వీస్తోందన్నారు గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి....

ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహ‍న్ రెడ్డి ప్రభంజనం వీస్తోందన్నారు గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. గురువారం వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలతో ర్యాలీగా ఆర్డీఓ ఆఫీసుకు వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధిస్తుందని చెప్పారు. వైసీపీని ఓడించేందుకు టీడీపీ, జనసేన అంతర్గత ఒప్పందంతో పనిచేస్తున్నాయని, ఈ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు గోపిరెడ్డి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏపీలో ఫ్యాన్ గాలీ వీస్తుందని, తప్పకుండా ప్రజలు వైసీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories