'గౌతమ్ నందా' దర్శకుడితో మళ్ళీ చేయి కలపనున్న మాచో స్టార్

గౌతమ్ నందా దర్శకుడితో మళ్ళీ చేయి కలపనున్న మాచో స్టార్
x
Highlights

2013లో 'సాహసం' సినిమా హిట్ అయినప్పటికీ గోపీచంద్ కెరీర్ లో ఆ సినిమా పెద్దగా హెల్ప్ అవ్వలేదు. ఎందుకంటే ఆ సినిమా తర్వాత వరుసగా డిజాస్టర్లు అందుకుంటూ...

2013లో 'సాహసం' సినిమా హిట్ అయినప్పటికీ గోపీచంద్ కెరీర్ లో ఆ సినిమా పెద్దగా హెల్ప్ అవ్వలేదు. ఎందుకంటే ఆ సినిమా తర్వాత వరుసగా డిజాస్టర్లు అందుకుంటూ వచ్చాడు గోపీచంద్. ఈ మధ్యనే తన 25వ సినిమా 'పంతం' తో ఫర్వాలేదనిపించిన గోపీచంద్ ప్రస్తుతం తన ఆశలన్నీ తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాపైనే పెట్టుకున్నాడు. భారీ బడ్జెట్ తో స్పై థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలకు ముందే గోపీచంద్ మరొక సినిమాలు లైన్ లో పెట్టాడు.

'గౌతమ్ నంద' సినిమా ఫేం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ సినిమా చేయనున్నాడు. ఇది కూడా భారీ బడ్జెట్ సినిమా అవడం విశేషం. యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుండి పట్టాలెక్కనుంది. సంపత్ నంది దర్శకత్వం వహించిన 'బెంగాల్ టైగర్' సినిమాను నిర్మించిన కె.కె.రాధామోహన్ ఈ సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం సాగుతోంది కానీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories