టీఆర్ఎస్‌లో చేరిన కార్తీక్ రెడ్డి

టీఆర్ఎస్‌లో చేరిన కార్తీక్ రెడ్డి
x
Highlights

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జిలానీలు ఎక్కువయ్యారు. టీఆర్ఎస్ ఆకర్ష్ తో కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటికే పలువురు...

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జిలానీలు ఎక్కువయ్యారు. టీఆర్ఎస్ ఆకర్ష్ తో కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నేతలు చేరిన విషయం తెలిసిందే కాగా తాజాగా టీఆర్ఎస్ గూటికి చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితాఇంద్రా రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యే తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరి దారులు వారు చూసుకుంటారని అన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వారు బీజేపీలో బీజేపీ వారు కాంగ్రెస్ చేరుతున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. శంషాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories