నల్గొండలో ఉత్తమ్..భువనగిరిలో కోమటిరెడ్డి

నల్గొండలో ఉత్తమ్..భువనగిరిలో కోమటిరెడ్డి
x
Highlights

కాంగ్రెస్ పార్టీ ఏపీ, తెలంగాణల నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను ఎట్టకేలకు ప్రకటించింది. ఏపీలో 22 మంది, తెలంగాణలో 8మంది పేర్లతో జాబితాను విడుదల...

కాంగ్రెస్ పార్టీ ఏపీ, తెలంగాణల నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను ఎట్టకేలకు ప్రకటించింది. ఏపీలో 22 మంది, తెలంగాణలో 8మంది పేర్లతో జాబితాను విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం ఆ పార్టీ దిగ్గజాలు మరోసారి బరిలో నిలిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇదివరకే తెలంగాణ నుంచి పోటీ చేసే 8 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా మరో 8 మంది పేర్లను ప్రకటించింది. ఖమ్మం స్థానానికి రేణుక చౌదరి పేరు పరిశీలనలో ఉండటంతో ఆ సీటును పెండింగ్‌లో ఉంచింది అధిష్టానం.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి ఎంపీగా పోటీ చేయనుండగా భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి, వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య, హైదరాబాద్ నుంచి ఫిరోజ్‌ఖాన్, మహబూబ్‌నగర్ నుంచి వంశీచంద్‌రెడ్డి, సికింద్రాబాద్ నుంచి అంజన్‌కుమార్ యాదవ్, నిజామాబాద్ నుంచి మధుయాష్కి‌గౌడ్ ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగనున్నారు.

ఇక ఏపీలో 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. ఆ పార్టీ 22 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నర్సాపురం నుంచి కనుమూరి బాపిరాజుకు టికెట్ ఇవ్వగా అరకు నుంచి శ్రుతి దేవి, కాకినాడ నుంచి పల్లం రాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, తిరుపతి నుంచి చింతా మోహన్‌లకు టికెట్ ఇచ్చింది. అయితే, విశాఖ, విజయవాడ, నంద్యాల లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు.

తెలంగాణ అభ్యర్థుల జాబితా:

* మహబూబ్ నగర్ - సీహెచ్ వంశీచందర్ రెడ్డి

* నల్గొండ - ఉత్తమ్ కుమార్ రెడ్డి

* వరంగల్ - దొమ్మాటి సాంబయ్య

* భువనగిరి - కోమటిరెడ్డి వెంకట రెడ్డి

* నాగర్ కర్నూల్ - మల్లు రవి

* నిజామాబాద్ - మధు యాష్కీ గౌడ్

* హైదరాబాద్ - ఫిరోజ్ ఖాన్

* సికింద్రాబాద్ - అంజన్ కుమార్ యాదవ్

ఏపీ ఎంపీ అభ్యర్థుల జాబితా:

* అరకు - శృతిదేవీ

* శ్రీకాకుళం - డోలా జగన్ మోహన్ రావు

* విజయనగరం - యడ్ల ఆదిరాజు

* అనకాపల్లి - శ్రీ రామమూర్తి

* కాకినాడ - పల్లంరాజు

* అమలాపురం - జంగా గౌతమ్

* రాజమండ్రి - ఎన్.వి. శ్రీనివాస్ రావు

* నరసాపురం - కనుమూరి బాపిరాజు

* ఏలూరు - జెట్టి గురునాథరావు

* మచిలీపట్నం - గొల్లు కృష్ణ

* గుంటూరు - ఎస్‌కే మస్తాన్ వలీ

* నరసరావుపేట - పక్కాల సూరిబాబు

* బాపట్ల - జేడీ శీలం

* ఒంగోలు - సిరివెల్ల ప్రసాద్

* కర్నూలు - అహ్మద్ అలీఖాన్

* అనంతపురం - కె. రాజీవ్ రెడ్డి

* హిందూపూర్ - కె.టి. శ్రీధర్

* కడప - జి.శ్రీరాములు

* నెల్లూరు - దేవకుమార్ రెడ్డి

* తిరుపతి - చింతా మోహన్

* రాజంపేట - షాజహాన్ బాషా

* చిత్తూరు - చీమల రంగప్ప

Show Full Article
Print Article
Next Story
More Stories