తలసాని కామెంట్స్‌పై చంద్రబాబు సీరియస్‌

Chandrababu
x
Chandrababu
Highlights

ఏపీ పర్యటనలో టీఆర్ఎస్‌ నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు అగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో మొక్కుల కోసం వచ్చి రాజకీయ వ్యాఖ్యలు...

ఏపీ పర్యటనలో టీఆర్ఎస్‌ నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు అగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో మొక్కుల కోసం వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ నేతల ఏపీ పర్యటనల్లో టీడీపీ నేతలు పాల్గొనవద్దని సూచించారు. ఎవరైనా పాల్గొంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బంధుత్వాలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి, స్నేహాలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలన్నారు. బంధుత్వాలు, స్నేహాల పేరుతో పార్టీని పణంగా పెట్టరాదని, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయవద్దని పార్టీ నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories