వైసీపీలోకి మరో టీడీపీ ఎంపీ...ఈ రోజు లేదా రేపు జగన్‌ను కలిసే అవకాశం ?

వైసీపీలోకి మరో టీడీపీ ఎంపీ...ఈ రోజు లేదా రేపు జగన్‌ను కలిసే అవకాశం ?
x
Highlights

పార్లమెంట్ సమావేశాలు ముగిసి 24 గంటలు కూడా గడవక ముందే ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార టీడీపీకి చెందిన పలువురు ఎంపీలు వైసీపీ వైపు...

పార్లమెంట్ సమావేశాలు ముగిసి 24 గంటలు కూడా గడవక ముందే ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార టీడీపీకి చెందిన పలువురు ఎంపీలు వైసీపీ వైపు చూస్తున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ పార్టీ వీడుతారంటూ ప్రచారం జరుగుతున్న సమయంలోనే మరో టీడీపీ పార్టీ మారుతున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పార్లమెంట్ సభ్యుడు రవీంద్రబాబు పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఈ రోజు లేదా రేపు జగన్‌ను కలిసే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రవీంద్ర బాబు పార్టీలోనే ఉంటాడని టీడీపీ నేతలు చెబుతున్నారు .

Show Full Article
Print Article
Next Story
More Stories