Syria: సిరియాలో మిలిటరీ అకాడమీపై డ్రోన్‌ దాడి.. 100 మందికి పైగా మృతి

100 killed in Drone attack on Syria Military Academy
x

Syria: సిరియాలో మిలిటరీ అకాడమీపై డ్రోన్‌ దాడి.. 100 మందికి పైగా మృతి

Highlights

Syria: ఉగ్ర సంస్థలే ఘటనకు పాల్పడినట్లు అనుమానం

Syria: సిరియాలో మిలిటరీ అకాడమీపై డ్రోన్‌ దాడి జరిగి 100 మందికి పైగా మృతి చెందారు. సుమారు 200 మంది గాయపడ్డారు. హోమ్స్‌లో మిలిటరీ గ్రాడ్యుయేషన్‌ వేడుక జరుగుతున్న సందర్భంగా ఈ దాడి చోటుచేసుకుంది. చనిపోయిన వారిలో సైనిక అధికారులు కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఉగ్ర సంస్థలే ఈ ఘటనకు పాల్పడినట్లు సిరియా మిలిటరీ ఆరోపించింది. అయితే సిరియా అంతర్యుద్ధంలో ప్రభుత్వంతో పోరాడుతున్న తిరుగుబాటుదారులుగానీ, జిహాదిస్టులు ఈ దాడిపై ప్రకటన విడుదల చేయలేదు.

మిలిటరీ కాలేజీలో శిక్షణ పూర్తికావడంతో గురువారం సైనిక అధికారులకు గ్రాడ్యుయేషన్‌ డేను నిర్వహించారు. ఈ వేడుకకు క్యాడెట్స్‌ కుటుంబ సభ్యులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా డ్రోన్‌ దాడి చేసుకోవడంతో ఒక్కసారిగా భయబ్రాంతులు చోటుచేసుకున్నాయి. ఆ ప్రాంతమంతా రక్తపు గాయాలతో, హాహాకారాలతో భీతావాహ దృశ్యం కనిపించింది. బాధితుల ఆర్తనాదాలతో ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వెంటనే తేరుకున్న సైనికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories