వంగవీటి రాధా ఎపిసోడ్‌పై క్లారిటీ ఇచ్చిన జగన్

వంగవీటి రాధా ఎపిసోడ్‌పై క్లారిటీ ఇచ్చిన జగన్
x
Highlights

వంగవీటి రాధా ఎపిసోడ్‌పై వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చారు. రాధాని విజయవాడ తూర్పుకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్నం పార్లమెంటు స్థానం...

వంగవీటి రాధా ఎపిసోడ్‌పై వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చారు. రాధాని విజయవాడ తూర్పుకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి బాలశౌరిని బరిలోకి దింపుతున్నట్టు జగన్ తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటుస్థాయి నేతల సమావేశంలో జగన్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

గడువులోపు వంగవీటి రాధా నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆయన్ని విజయవాడ ఈస్ట్‌కే పరిమితం చేసింది వైసీపీ. మచిలీపట్నం ఎంపీ లేదా విజయవాడ తూర్పులో ఏదోఒక స్థానం నుంచి పోటీ చేయాలని జగన్, రాధాకు సూచించారు. అయితే, రాధా నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో బాలశౌరికి మచిలీపట్నం ఎంపీ సీటు కేటాయించారు. దీంతో రాధా, విజయవాడ తూర్పు నుంచే పోటీ చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories